దమ్మపేట: మండలంలో రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని మల్లారం, మల్కారంతో పాటు తదితర రైతువేదికలను అందంగా అలంకరించడంతో పాటు రైతువేదికల వద్ద తెలంగాణ రైతుబంధు అని అక్షరమాలతో రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మల్కారం రైతువేదిక వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
దీంతో మండలంలో రైతుబంధు సంబురాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, మండల వ్యవసాయాధికారి శీలం చంద్రశేఖర్రెడ్డి, ఏఈవో దీప్తి, మాజీ ఆత్మచైర్మన్ కేదాసివెంకట సత్యనారాయణ,సర్పంచ్లు,ఎంపీటీసీలు,నాయకులు,రైతులు,అధికారులు పాల్గొన్నారు.