దమ్మపేట: యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలను సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం సూచించారు. దమ్మపేట, పట్వారిగూడెం రైతు వేదికల్లో సోమవారం రైతులతో ఆమె ఏఓ చంద్రశేఖర్ రెడ్డితో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గోదాముల్లో అత్యధికంగా ధాన్యం నిల్వ వున్నందున డిమాండ్ లేదని చెప్పారు. అపరాల సాగుపై దృష్టి పెట్టాని అన్నదాతలకు సూచించారు. ఈ సమావేశంలో ఏఈఓలు దీప్తి, వినోద్, రైతులు పాల్గొన్నారు.