– మాజీ కౌన్సిలర్, బీజేపీ నాయకుడితో సహా
– ఆహ్వానించిన ఎంపీ వద్దిరాజు, ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 29 : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు సమక్షంలో బీజేపీకి చెందిన సుమారు 300 మంది ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ కొత్తగూడెం పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు ఏమునూరి శివకృష్ణ ఆధ్వర్యంలో గాజుల రాజమ్ బస్తీకి చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. కొత్తగూడెం తెలంగాణ భవన్ లో గురువారం మధ్యాహ్నం వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మయ్య, లక్ష్మీబాయి, నర్సింహా, కాళి, మోహన్, నర్సమ్మ, ఫర్జానా, వంశీ, నారాయణ, నవీన్, బిట్టు, ప్రవీణ్, ప్రమోద్, తదితరులు బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాపు సీతామహాలక్ష్మీ, బండారు రుక్మేందర్, నవతన్, మిట్టపల్లి కిరణ్, అనుదీప్, తురక రాంకోటి పాల్గొన్నారు.