కార్మికుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. ఆయన సారథ్యంలో సంక్షేమ పథకాలకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ ఉండకూడదనే, అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారని గుర్తుచేశారు. ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లో తీసుకుంటామనడం, మెప్మా, ఐకేపీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తామనడం, వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పిస్తామనడం, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాలను రూ.3 వేలకు పెంచుతామనడం వంటి హామీలను ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇవ్వడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కృతజ్ఞతగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీఎం ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేశారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్