రఘునాథపాలెం : ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో డబుల్బెడ్రూం ఇండ్లు పొందిన నిరుపేద లబ్దిదారులు సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టేకులపల్లిలోని డబుల్బెడ్రూం ప్రాంగణంలో ఖమ్మం నగరం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, జిల్లా మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, గ్రంథాలయ చైర్మన్ ఎండీ ఖమర్, డిప్యూటీ మేయర్ ఫాతీమా జొహేరా, మంత్రి పీఏ చిరుమామిళ్ల కిరణ్ కుమార్, నగర కార్యదర్శి ఇషాక్, కార్పొరేటర్ మక్బూల్ తదితరులు ఉన్నారు.