చింతకాని : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. మండల పరిధిలో లచ్చగూడెం గ్రామ దళిత కాలనీలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని మాటాడారు.
దళితుల సాధికారిత సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, దేశానికే దిక్సూచిలా దళితబంధు కార్యక్రమం నిలువనున్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గురజాల ఝాన్సీ, వైస్ఎంపీపీ గురజాల హనుమంతరావు, సోసైటీ డైరక్టర్ తాతా ప్రసాద్, ఉపసర్పంచ్ మేకపోతుల సైదేశ్వరరావు, గ్రామశాఖ నాయకులు గురజాల కృష్ణయ్య, పిట్టల ప్రభాకర్, దళిత సంఘాల నాయకులు, దళితులు పాల్గొన్నారు.