మామిళ్లగూడెం, మార్చి 12 : జిల్లాలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిషారానికి సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిషారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 10,273 దరఖాస్తులు ధరణిలో పెండింగ్లో ఉండగా, మొత్తం 4,180 దరఖాస్తులు పరిషరించినట్లు, ఇందులో 2,496 దరఖాస్తులు ఆమోదించగా, 1,684 దరఖాస్తులు తిరసరణకు గురైనట్లు తెలిపారు. మిగులు పెండింగ్ దరఖాస్తులకు యుద్ధప్రాతిపదికన పరిషార చర్యలు చేపట్టాలన్నారు. దరఖాస్తుల పరిశీలనలో రికార్డులు ముఖ్యమని తెలిపారు. ప్రతి దరఖాస్తుకు ఈసీ ఉండాలన్నారు. లింక్ డాక్యుమెంట్లు పరిశీలించాలన్నారు. తొలగింపు ఉత్తర్వులకు డాక్యుమెంట్లు, స్పీకింగ్ ఆర్డర్లు, వివరణలతో సమర్పించాలన్నారు. టీఎం-33 మాడ్యూల్కు సంభందించి దరఖాస్తులు మొదటగా పరిషరించాలని, మాడ్యూళ్ల ప్రకారం దరఖాస్తుల పరిషారం సులువవుతుందని తెలిపారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్సింగ్, యువరాజ్, ఖమ్మం ఆర్డీవో జి.గణేష్, ఎస్డీసీ రాజేశ్వరి, తహసీల్దార్లు, ధరణి ఓఎస్డీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, మార్చి12 : జిల్లాలో స్వీప్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్వీప్ కోర్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒకరూ ఓటు హకు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. కళాశాలల్లో అడ్మిషన్లు పొందిన 18 ఏళ్లు నిండిన ప్రతి ఒకరు ఓటు హకు పొందేలా చూడాలన్నారు. హైసూల్, కళాశాలల్లో మాక్ పోల్ చేపట్టి విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సీ-విజిల్ డౌన్లోడ్ చేయించాలని, ఇది వరకే చేసుకున్న వారి మొబైళ్లలో సీ-విజిల్ యాప్ ఉన్నదీ లేనిదీ పరిశీలించాలని తెలిపారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, ఎన్సీసీ కేడెట్లను ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.శ్రీరామ్, డీఈవో సోమశేఖరశర్మ, కలెక్టరేట్ ఏవో అరుణ, సూపరింటెండెంట్లు మదన్గోపాల్, రాంబాబు పాల్గొన్నారు.