కొణిజర్ల/ వైరా టౌన్, జూలై 31: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై రాష్ట్ర ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. అందుకే వందలాది మంద ప్రజలు వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కొణిజర్ల మండలం కొండవనమాల, పెద్దమునగాల, సింగరాయపాలెం, అన్నవరం గ్రామాల్లోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సుమారు 250 కుటుంబాల వారు ఎమ్మెల్యే రాములునాయక్ సమక్షంలో వైరా ఆయన కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ రాములునాయక్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం ఉద్యమం చేసి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. దానిని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. నేడు అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉంటున్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. కొంతమంది అవకాశవాదులు ప్రతిపక్ష పార్టీల్లో చేరుతూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ చేరుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే కేసీఆర్ను మరోమారు ముఖ్యమంత్రిని చేస్తాయని స్పష్టం చేశారు. గృహలక్ష్మి, దళితబంధు, మైనార్టీ, బీసీ రుణాలు, ఇతర పథకాలు త్వరలోనే అర్హులందరికీ అందుతాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని నిధులివ్వని బీజేపీకి, అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్కు తెలంగాణలో చోటులేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వై.చిరంజీవి, ఏలూరి శ్రీను, పోట్ల కవిత, పోట్ల శ్రీనివాసరావు, బండారు కృష్ణ, డేరంగుల బ్రహ్మం, దొడ్డపునేని రామారావు, కిలారు మాధవరావు, ధరావత్ బాబులాల్, షేక్ మౌలానా, పోగుల శ్రీను, కొచ్చర్ల భిక్షం తదితరులు పాల్గొన్నారు.