నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి
ఇల్లెందు, సెప్టెంబర్ 26: రైతుల సమస్యలపై రైతన్న సినిమా నిర్మించామని ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఆదివారం సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన ఇల్లెందుకు వచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. రైతులపై తీసిన రైతన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. తెలంగాణలో రైతన్నకు కష్టం లేకుండా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అన్నదాతల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా చరిత్రలో నిలిచిపోతాయన్నారు. దేశంలో మరెక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా రైతన్నలు నిరసనలు వ్యక్తం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ఇప్పటికైనా కేంద్రం దృష్టి పెట్టి రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సినిమా తీయడం ఒక కళ అని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, నాయకుడు సుధీర్తోత్లా పాల్గొన్నారు.