ఖమ్మం: ప్రముఖ మల్టినేషనల్ కంపెనీ విప్రోలో ఖమ్మంలోని స్వర్ణభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్బీఐటీ) కళాశాలకు చెందిన 21మంది విద్యార్థులు సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించారని ఎస్బీఐటీ విద్యాసంస్ధల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు శుక్రవారం ఆన్లైన్లో రాత, టెక్నికల్, హెచ్ఆర్ విభాగాలలో నియామక పరీక్షలు నిర్వహించారు. కంప్యూటర్ సైన్స్ నుంచి 13మంది, ఎలక్ట్రానిక్స్ నుంచి 7గురు, మెకానికల్ నుంచి ఒకరు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎంపికైయ్యారని పేర్కొన్నారు.
ఉద్యోగాలు సాధించిన వారికి వార్షిక వేతనం రూ.3.5లక్షలుగా ఉంటుందన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ గుండాల ధాత్రి, అకడమిక్ డైరక్టర్ శివప్రసాద్, సి.శ్రీనివాసశర్మ, ప్రవీణ్కుమార్ తదితరులు అభినందించారు.