ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
ఘనంగా మహర్షి వాల్మీకి జయంత్యోత్సవాలు
మామిళ్లగూడెం, అక్టోబర్ 20: రామాయణ మహా కావ్యం ద్వారా మహర్షి వాల్మీకి సర్వజనులకు జ్ఞాన బోధన చేశారని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సంస్కృతంలో పద్యాలు రాసిన మొదటి కవి మహర్షి వాల్మీకి అని కొనియాడారు. వేటాడే వృత్తిని కొనసాగించిన వాల్మీకి చివరికి మహా రుషిలా మరాడన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి.రాహుల్, జిల్లా బీసీ సంక్షేమాధికారి జ్యోతి, డీఎంఎహెచ్వో డాక్టర్ మాలతి, జిల్లా ఎస్సీ సంక్షేమ ఉపసంచాలకుడు కె.సత్యనారాయణ, జిల్లా ఉద్యానవన శాఖాధికారి అనసూయ, డీఈవో యాదయ్య, జిల్లా సంక్షేమాధికారి సంధ్యారాణి, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, ఆర్టీవో కిషన్రావు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పిండిప్రోలు రామ్మూర్తి, ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ కార్యదర్శి నందకిశోర్, సంఘం నగర అధ్యక్షుడు డి శ్రీనివాస్, నాయకులు ఉపేందర్, రవి, రమేశ్, షకీన, సుగుణ, రమణ, పుల్లయ్య పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ కారాయలయంలో..
ఖమ్మం జడ్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహోన్నత ఇతిహాసమైన రామాయణం ద్వారా శ్రీరాముడి చరితాన్ని ప్రజలకు తెలియ జేసిన గొప్ప ఆది కవి వాల్మీకి అని అన్నారు. జడ్పీ కార్యాలయ పర్యవేక్షకులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు.