ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తారక్కు కరోనా అని తెలిసి అభిమానులే కాదు మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్స్ కూడా ఆయన ఆరోగ్యంపై ఆరాలు తీసారు.
కొద్ది సేపటి క్రితం జూనియర్ మరోసారి కరోనా టెస్ట్ చేయించుకోగా, నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. నెగెటివ్ వచ్చిందని చెప్పడానికి సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కిమ్స్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి, మా కజిన్ డాక్టర్ వీరు, టెనెట్ డయాగ్నిస్టిక్స్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి కేరింగ్ వలన నేను త్వరగా కోలుకున్నాను. కోవిడ్ 19ను మనం సీరియస్గానే పరిగణించాలి. పాజిటివ్ మైండ్తో ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాని తరిమికొట్టవచ్చు. మీ శక్తే మీ ఆయుధం. ధైర్యంగా ఉండండి, భయపడకండి అని తారక్ తన ట్వీట్లో పేర్కొన్నారు.