మామిళ్లగూడెం, ఫిబ్రవరి 26 : జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 70 కేంద్రాల్లో 36,578 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని, 97 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు, డీఈవో సోమశేఖరశర్మ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుబ్బారావు, విద్యుత్శాఖ ఎస్ఈ సురేందర్, జడ్పీ సీఈవో వినోద్, డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్, ఏసీపీ సాంబయ్య, వైరా, సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్లు సీహెచ్ వేణు, రవిబాబు, పోస్టల్శాఖ సూపరింటెండెంట్ బి.రవికుమార్, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్, జిల్లా కోశాధికారి సత్యనారాయణ, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ డేలో అందిన అర్జీలను సత్వరమే పరిషరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డే(ప్రజావాణి)లో అర్జీదారుల నుంచి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆయన వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో మార్చి 3వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య, సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, విద్యా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెల్ఫేర్ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 92,511 మంది 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులను గుర్తించామని, 4,984 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. 26ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 30 అర్బన్ ప్రాంతాల్లో 252, రూరల్ ప్రాంతాల్లో 843, ట్రైబల్ ప్రాంతాల్లో 151 మొత్తం 1,246 కేంద్రాలు, 70 మొబైల్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. వీటితోపాటు బస్టాండ్, రైల్వేస్టేషన్, జన సమూహాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పోలియో చుకలు వేయాలని అధికారులకు సూచించారు. మార్చి 3వ తేదీ తర్వాత మిగిలిన చిన్నారులకు మరుసటి రోజు ఇంటింటికీ తిరిగి పోలియో చుకలు వేయాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సన్యాసయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ సైదులు, డాక్టర్ ప్రమీల, డాక్టర్ ప్రశాంత్, జిల్లా పరిషత్ సీఈ వినోద్, డీఈవో సోమశేఖర్శర్మ, డీడీ సోషల్ వెల్ఫేర్ సత్యనారాయణ, టీఎస్ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సురేందర్, బీసీ వెల్ఫేర్ అధికారి జ్యోతి, జిల్లా సంక్షేమ అధికారి రాం గోపాల్రెడ్డి, అనుబంధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.