సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 28 : రాష్ట్రం లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా దవాఖానలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా విలేకరులతో మా ట్లాడుతూ, స్వరాష్ట్రంలోనే వైద్య సేవలపై ప్రజలకు విశ్వాసం ఏర్పడిందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదే తరహాలో శ్రద్ధ చూపాలని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అ వసరమైన కిట్స్, మందులు, బెడ్స్, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా వైద్యులు చర్యలు తీసుకోవాలన్నారు. దవాఖానలోని పలు సమస్యలను వైద్యాధికారులు జడ్పీచైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీధర్రావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్, జడ్పీటీసీ గుగులోతు కళావతి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ పాల్గొన్నారు.