Thimmapur | తిమ్మాపూర్, జూలై 10 : రోడ్డు పక్కన వేసిన చెత్తాచెదారం ఓ గుర్తు తెలియని మహిళ మృతికి కారణమైంది. గ్రామస్తులు రహదారుల వెంట వెళ్లే ప్రయాణికులు తమ చెత్త చెదరన్నంత రోడ్ల పక్కన వేస్తూ కంపు చేస్తున్నారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో.. అటుగా వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు నిప్పులో పడి, తీవ్రంగా గాయపడింది.
సమాచారమందుకున్న పోలీసులు వెళ్లి తీవ్రగాయాలతో ఉన్న ఆమెను అంబులెన్స్ లో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ప్రమాదవశాత్తు పడిందా.. లేక ఏదైనా మంటల్లో ఉన్న వస్తువు తీసుకునేందుకు వెళ్లి పడిందా..? అనేది తెలియదు. మృతి చెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.