మెట్పల్లి, అక్టోబర్ 31: వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన బీఆర్ఎస్ కోరుట్ల అభ్యర్థి డా. కల్వకుంట్ల సంజయ్ ఓ వైపు విస్తృత ప్రచారం చేస్తూనే, మరోవైపు రోగులకు వైద్య సాయం చేస్తున్నారు. సంజయ్ హైదరాబాద్లోని యశోద దవాఖానలోని ప్రముఖ వైద్యు ల్లో ఒకరు. ఇరవై ఏళ్లుగా వైద్యవృత్తిలో ఉన్నారు. వైద్యసేవల కోసం వచ్చిన ఎందరికో దవాఖానలో వైద్యసహాయం అందించేందుకు తోడ్పడ్డారు. నియోజకవర్గంలోనూ అనేక మార్లు ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించారు. కరోనా సమయంలో కిట్లు, కృత్రిమ ఆక్సిజన్ సిలిండర్లు, మందులు పంపిణీ చేశారు. ప్రజలకు మరింతగా వైద్యంతో పాటు అన్ని రకాలుగా సేవచేయాలనే ఒక సదాశయంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయ న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. రెండు నెలలుగా ఊరూరా తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎము క, వెన్నుముఖ, ఇతరాత్ర సమస్యలతో తన వద్ద కు వచ్చే రోగులకు వైద్యపరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతోనే ప్రతి రోజూ ఉదయం ఆయన దినచర్య ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోకి వెళ్లిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎంత బిజీగా ఆపదలో తనకు వద్దకు వచ్చే రోగులకు ‘నేనున్నాను అనే ఒక భరోసాను కల్పిస్తున్నారు. కాగా, మంగళవారం ఉదయం ఎము క, వెన్నెముకకు సంబంధించి సమస్యతో బాధపడుతున్న పలువురు మెట్పల్లిలోని పార్టీ కార్యాలయానికి రాగా, సంజయ్ పరీక్షించారు. ఎక్స్రేలు, కేస్షీట్లను పరిశీలించి, మందులు రాశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.