Chada Venkat Reddy | చిగురుమామిడి, జూన్ 29 : భారత కమ్యూనిస్టు పార్టీ కోసం విశేషంగా కృషిచేసి అసువులు బాసి, ఆశయాల సాధన కోసం కృషిచేసి అమరులైన వారు త్యాగాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో స్వర్గీయ మాజీ ఎంపీపీ చాడ ప్రభాకర్ రెడ్డి సతీమణి మాజీ ఎంపీటీసీ చాడ శోభ ప్రథమ సంవత్సరం వర్ధంతిని పురస్కరించుకొని చిత్రపటం వద్ద నాయకులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం బొమ్మనపల్లిలోని కుందేళ్ల వెంకటి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ కోసం అంకితభావంతో అనేక ఉద్యమాలు పోరాటాలు చేశారన్నారు.
పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు నాయకులు కార్యకర్తలు అందరూ కృషి చేయాలన్నారు. ఆయన వెంట సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, చాడ మురళీధర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, అంది చిన్నస్వామి, బూడిద సదాశివ, గ్రామ శాఖ కార్యదర్శి అందే సంపత్, మాజీ సర్పంచ్ గోలి బాపురెడ్డి, నాయకులు మొగిలి ఓదెలు, తాళ్లపల్లి చంద్రయ్య, తిరుపతి, రాజు, కొమురయ్య, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారితోపాటు రేకొండలో సామాజికవేత్తలు కొమురవెల్లి రమేష్ గొడిశాల శ్రీనివాస్, జీవన్, నాగిళ్ల సదానందం, బండోజు రమేష్, దుబ్బాక వెంకటేష్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.