విద్యానగర్, జనవరి 9: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లి జనవరి 18 నుంచి ప్రభుత్వం చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పిలుపు నిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ప్రజల దృష్టిలోపాలను నివారిం చేందుకే ప్ర భుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ 2023లో నిర్వహించనున్న రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి మెడికల్ ఆఫీసర్, సూపర్ వైజర్, ఆప్తాల్మాజిస్ట్, ఇద్దరు ఎంపీహెచ్ఏలు, ముగ్గురు ఆశ కార్యకర్తలు, డీఈవో మొత్తంగా 9 మందితో కూ డిన 48 బృందాలను సిద్ధం చేశామని, రూరల్లో 29, అర్బన్లో 19, అదనంగా మరో 4 బఫర్ బృందాలతో మొత్తం 52 బృందాలను ఏర్పాటు చేసుకుని పంచాయతీల వారిగా శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.
18 ఏండ్లు పైబడిని వారికి కంటిపరీక్షలను నిర్వహించి అద్దా లు, మందులు అందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 40వేలకు పైగా రీడింగ్ గ్లాసెస్ తెప్పించామని, ప్రిస్రైబ్డ్ గ్లాసెస్ అవసరమున్నవారికి శిబిరం నుంచే కంపెనీకి వారి పేరునే ఆర్డర్ పెడతామని తెలిపారు. ఆపరేషన్లు అవసరం ఉన్న వారికి జిల్లా ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్తామన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల మేలు కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. పేదలకు కంటిచూపును ప్రసాదించేందుకే కంటి వెలుగును చేపట్టిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రి యాంక, జిల్లా వైద్యాధికారి జువేరియా, మున్సిప ల్ కమిషనర్ సేవాఇస్లావత్ తదితరులు ఉన్నారు.