వేములవాడ టౌన్, డిసెంబర్ 25: వేములవాడ రాజన్న క్షేత్రం కిక్కిరిసింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో జనసంద్రమైంది. సుమారు 80 వేల మంది తరలివచ్చారు. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం చేసి, స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఏ లైన్లో చూసినా పెద్ద సంఖ్యలో కనిపించారు.
రెండు మూడు గంటల పాటు క్యూలో ఉండి మరీ దర్శించుకున్నారు. వివిధ ఆర్జిత సేవల ద్వారా ఆలయానికి 35 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, భక్తులు నిలిపిన వాహనాలతో ఆలయ పార్కింగ్ స్థలం జాతరను తలపించింది. ఇటు రాజన్న అనుబంధ ఆలయాలైన భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయాల్లోనూ రద్దీ కనిపించింది.