వేములవాడ, ఫిబ్రవరి 19: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళి త బంధు నిరుపేద దళిత కుటుంబాలకు వరం లాంటిదని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు పేర్కొన్నారు. మల్లారం గ్రామానికి చెందిన మ ల్లారం ప్రశాంత్ దళిత బంధు కింద పట్టణంలో ని మల్లారం రహదారిలో సహస్ర సూపర్ మారెట్ను ఏర్పాటు చేసుకోగా ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. దళితబంధు కింద నియోజకవర్గానికి తొలుత 100 యూనిట్లు మంజూరయ్యాయని, పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడడమే కాదు వాటిని పకడ్బందీగా అమలు చేస్తూ వెలుగులు నింపుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తున్న మన తెలంగాణ వైపే దేశ ప్రజలంతా చూస్తున్నారన్నారు. మంచి లాభాలతో వ్యాపారాన్ని నడుపుకోవాలని లబ్ధిదారుడు ప్రశాంత్కు సూచించి పలు వస్తువులను ఎమ్మెల్యే కొనుగోలు చేశారు. ఇక్కడ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు గోసుల రవి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ నామాల ఉమ, ఏఎంసీ వైస్ చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, మల్లారం సర్పంచ్ పండుగ తిరుపతి, ఎంపీటీసీ తిరుపతి, బొల్లారం సర్పంచ్ లచ్చయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఏస తిరుపతి, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, సిరిగిరి రామ్ చందర్, నాయకులు కొండ కనకయ్య, యామ తిరుపతి తదితరులు ఉన్నారు.