కథలాపూర్/మేడిపల్లి, డిసెంబర్ 3 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె గ్రామంలో జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేద్దామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పిలుపునిచ్చారు. శనివారం కథలాపూర్ మండలకేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్హాల్తోపాటు మేడిపల్లి మండల కేంద్రంలోని పీఎన్ఆర్ గార్డెన్లో నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో రమేశ్బాబు మాట్లాడారు. సభకు మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల నుంచి 25 వేల మందిని తరలించాలని కార్యకర్తలకు సూచించారు.
సభ ప్రాంగణానికి మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకోవాలని తెలిపారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా ప్రతి నాయకుడు బాధ్యత తీసుకొని సీఎం సభ విజయవంతం చేయాలని సూచించారు. సభ సందర్భంగా సీఎం కేసీఆర్ కథలాపూర్ మండలంలోని ప్రధానమైన సూరమ్మ ప్రాజెక్టు కుడికాలువ పనులు, ఎత్తిపోతల ద్వారా సూరమ్మ ప్రాజెక్టు నింపే పనుల గురించి ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఇంకా అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు కొత్తగా మంజూరు చేస్తారని, ప్రతి గ్రామంలో కుల సంఘాల భవనాలకు నిధులు కేటాయించే అవకాశం ఉందని చెప్పారు.
ఆయా కార్యక్రమాల్లో జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్రావు, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ జవ్వాజి రేవతి, ఎంపీపీలు దోనకంటి ఉమాదేవి, జువ్వాజి రేవతి, జడ్పీటీసీ భూమయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వంగ వెంకటేశం, సర్పంచ్లు ఈర్నాల సంపత్కుమార్, ఎంపీటీసీలు మకిలి దాస్, పల్లి అర్జున్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ మిట్టపెల్లి రమేశ్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కాటిపెల్లి శ్రీపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు క్యాతం సత్తిరెడ్డి, నాయకులు దోనకంటి రాజరత్నాకర్రావు, నెల్లుట్ల ప్రభాకర్, చెక్కపెల్లి రఘు ఉన్నారు.