Irrigation water | హుజురాబాద్, మార్చి 13 : ఏప్రిల్ చివరి వరకు సాగునీళ్లు ఇవ్వాలని వీణవంక మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు నీటిపారుదల శాఖ ఇంజనీరుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. వీణవంక మండలంలోని కనపర్తి నర్సింగాపూర్, లస్మక్కపల్లె, వల్బాపూర్, కాపులపల్లె, కోరపల్లి తదితర గ్రామాలకు చెందిన వరి, మొక్కజొన్న పంటలు ఇప్పుడప్పుడే చేతికొచ్చే పరిస్థితి లేదని, ఏప్రిల్ చివరి వరకు సాగునీరువ్వాలని విజ్ఞప్తి చేశారు.
దాదాపు 1000 ఎకరాలలో పంటలు పచ్చదనంతో ఉన్నాయని, ఒకవేళ నీళ్లు ఇవ్వని పక్షంలో ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ, మగ పంటలు వేశామని, నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున . నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు.