తెలంగాణ పులిబిడ్డ గర్జించింది. ఢిల్లీ పీఠం దద్ధరిల్లేలా తీర్పునిచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం ప్రదర్శిస్తూ ప్రతిపక్షపార్టీని మట్టికరిపించింది. క్యాషాయపార్టీ డ్రామాలు, ప్రలోభాలకు లొంగేది లేదంటూ మునుగోడు ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే జై కొట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం ఉంచి అధికార టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు.
బీఆర్ఎస్ ప్రకటించాక జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించడంపై రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. బాచాసంచా కాల్చుతూ, మిఠాయిలు పంపిణీ చేస్తూ వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్కు రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై భారత్ నినాదాలతో హోరెత్తించారు. గులాబీ జెండాల రెపరెపల నడుమ అడుగడుగునా బీఆర్ఎస్ బ్యానర్లు ఆకర్షించాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా విజయోత్సవ సంబురాల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ అందరిలో జోష్ నింపారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన తరువాత విజయ సంకేతం చూపుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
తెలంగాణ భవన్లో విజయోత్సవ సంబురాల్లో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నాగేశ్, వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కట్టెల శ్రీనివాస్యాదవ్ తదితరులు
మునుగోడు విజయోత్సవాల్లో మహిళా నాయకుల నృత్యాలు
నల్లగొండ జిల్లా మర్రిగూడలో టీఆర్ఎస్ శ్రేణుల బైక్ర్యాలీ
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో విజయోత్సవ వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణులు
యదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో పత్తి చేనులో కూలీలకు స్వీట్లు పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ మహిళావిభాగం మండలాధ్యక్షురాలు అరుణ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో పటాకులు కాల్చి సంబురాలు చేసుకుంటున్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, టీఆర్ఎస్ శ్రేణులు