కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 28: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు, దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డీ జనార్దన్ తెలిపారు. హైదరాబాద్లోని బోయినపల్లిలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీ, ఆదిలాబాద్ జిల్లాలోని జాతర్లలో బాలుర మోడల్ స్పోర్ట్స్ స్కూల్, ఊట్నూర్ బాలుర పాఠశాల, అసిఫాబాద్లోని బాలికల పాఠశాలలో, కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని బాలుర పాఠశాల, కాచనపల్లిలోని బాలికల గురుకులంలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు జరుగుతున్నట్లు వెల్లడించారు.
ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 9 నుంచి 11 ఏండ్లలోపు వయస్సు ఉన్న గిరిజన విద్యార్థులు డీటీడబ్ల్యూవో, కరీంనగర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 4 నుంచి 6 దాకా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు, జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ద్వారా దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయని, వివరాలకు 9059175379 నంబర్లో సంప్రదించాలని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.