కార్పొరేషన్, డిసెంబర్ 10: సీఎం కేసీఆర్ స్థా పించిన బీఆర్ఎస్తో దేశ ప్రజలకు న్యా యం జరుగుతుందని స్టేట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ అన్నారు. తన కూతురు పెండ్లి నాడు పదవి ఇచ్చిన కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ఏ బాధ్యత అప్పగిం చినా చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు. శనివారం ఆయన కరీంనగర్లోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు.
బండి సంజయ్ చేస్తున్న అర్థంపర్థంలేని వ్యా ఖ్యలే ఇందుకు నిదర్శమని చెప్పారు. రాజకీయ అజ్ఞాని అయిన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడే అర్హతలేదన్నారు. స్వరా ష్ట్ర సాధన కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కిషన్రెడ్డి దాక్కున్నారని విమర్శించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రధాని కావడం ఖాయమని పేర్కొన్నారు. దేశంలోని అన్ని పార్టీలు కేసీఆర్వైపు చూస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ జాతీ య పార్టీ ప్రకటించగానే ఆర్ఎస్ఎస్ కేంద్ర కా ర్యాలయంలో జాతీయ జెండా ఎగిరిందన్నారు.
ఇప్పటి నుంచి తాము భారతమాత కోసం పని చేస్తామని తెలిపారు. తెలంగాణను మరోసారి ఆంధ్రాతో కలిపే కుట్రలు సాగుతున్నాయని మండిపడ్డారు. ఆంధ్రా నాయకుల మాటల వెనుక బీజేపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. షర్మిల, బండి పాదయాత్రల పేరుతో తెలంగాణకు మరోసారి అన్యాయం చేసేందుకు కుట్రలు చేస్తు న్నారని దుయ్యబట్టారు. మంత్రి గంగులతో కలిసి మరింత ముందుకు ఉత్సహాంగా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, పెండ్యాల మహేష్కుమార్, దండబోయిన రాములు, కుమార్, హర్మిందర్ పాల్గొన్నారు. అంతకుముందు గ్రీన్చాలెంజ్లో భా గంగా రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు.