కోరెం గ్రామానికి చెందిన చెన్నాడి హన్మంతరావు, శాంతమ్మ కొడుకులైన మార్తాండరా వు, జగన్మోహన్రావు, మధన్మోహన్రావు, సుధాకర్రావు, అలాగే చెన్నాడి సత్యనారాయణరావు, లక్ష్మమ్మ కొడుకైన రవీందర్రావు గ్రామాభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్నారు. తల్లిదండ్రుల ఆశయం మేరకు సొంతూరి సేవలో తరిస్తున్నారు. ఎప్పటికప్పుడు గ్రామ అవసరాలను గుర్తించి సొంత ఖర్చులతో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పనులు చేస్తున్నారు. ఇంకా ఏ ప్రభుత్వ భవన నిర్మాణానికి స్థలం అవసరమైనా విరాళంగా అందిస్తున్నారు.
ఇప్పటికే 33/11 విద్యుత్తు ఉప కేంద్రానికి, రైతు వేదికకు అందజేశారు. వైకుంఠధామం నిర్మాణానికి రెండెకరాల స్థలం అవసరం పడగా, ఆ ప్రాంతంలో అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు చేసి మరీ ఇచ్చారు. తాజాగా గ్రా మ జీపీ భవనానికి విరాళంగా అందజేశారు. మరోవైపు గ్రామంలో కుల సంఘాలకు భవనాలు నిర్మిస్తున్నారు. 10లక్షలతో రజక సం ఘ భవనం నిర్మించారు. మరో సామాజిక వర్గం కోసం ఎల్లమ్మ గుడిని నిర్మిస్తున్నారు.
గ్రామంలో పూర్తిగా శిథిలమైన ప్రాథమిక పాఠశాలను తొలగించి కార్పొరేట్ స్థాయిలో 61లక్షలతో భవనం నిర్మించారు. స్కూల్ లో మధ్యాహ్నం భోజనం చేసేందుకు డైనింగ్ హాల్, వంట గది, మూత్రశాలలు, వాష్రూం లు, ప్రహరీ నిర్మించి విద్యార్థుల తల్లిదండ్రుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇక గ్రామపంచాయతీ భవనానికి స్థలం విరాళంగా ఇవ్వడంతోపాటు 48లక్షలు వెచ్చించి జీ ప్లస్ వన్ పద్ధతిలో ఆధునిక హంగులతో భవనాన్ని నిర్మిం చి గ్రామస్తుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇప్పటి వరకు గ్రామాభివృద్ధికి 1.50కోట్లపైనే వెచ్చించారు. కాగా, నూతనంగా నిర్మించిన స్కూల్తోపాటు జీపీ భవనాలకు ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్తోపాటు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభోత్సవం చేయబోతున్నట్లు స్థానిక సర్పంచ్ చెన్నాడి రాజ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ చెన్నా డి సుధాకర్రావు తెలిపారు.
వారి పథం. జన చేతనం. సమాజ సేవే అభిమతం. సొంతూరిని అభివృద్ధి చేయడం అంటే మహా ఇష్టం. వారే చెన్నాడి కుటుంబ సభ్యులు. తల్లిదండ్రులపై ఉన్న అభిమానంతో వారి కోరిక మేరకు జన్మనిచ్చిన కోరెం గ్రామ రుణం తీర్చుకుంటున్నారు. ప్రజల సౌకర్యార్థం సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేయడమేకాదు గ్రామంలో ప్రభుత్వ భవనాలకు భూ విరాళం కూడా చేస్తున్నారు. కమ్యూనిటీహాల్స్, ఆలయాలు నిర్మించి ఇస్తున్నారు. తాజాగా కార్పొరేట్ హంగులతో స్కూల్, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించగా, నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు.
– బోయినపల్లి, జనవరి 27
మా అమ్మ శాంతమ్మ కోరిక మేరకే సొంతూరును అభివృద్ధి చేశాం. ఇప్పటి వరకు మా సొంత డబ్బులతోనే పనులు చేసినం. గ్రామ పంచాయతీని పూర్తిగా సొంత డబ్బులతోనే నిర్మించగా, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన 12లక్షలు చెక్కు రూపంలో గ్రామాభివృద్ధి కమిటీకి ఇచ్చాం.
– చెన్నాడి సుధాకర్రావు, మాజీ ఎమ్మెల్సీ
గ్రామాభివృద్ధే లక్ష్యంగా మా కుటుంబం పనిచేస్తోంది. ఇప్పటికే గ్రామంలో పాఠశాల, గ్రామపంచాయతీ, వివిధ సామాజిక వర్గాలకు భవనాలు నిర్మించాం. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు ఇచ్చాం. మార్తాండరావు ట్రస్టు ఏర్పాటు చేసి విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నాం.
– చెన్నాడి రాజ్యలక్ష్మి, గ్రామ సర్పంచ్