తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మహిళలు బతుకమ్మలను పేర్చి గ్రామ కూడళ్లలో పెట్టి ఆడారు.
బతుకమ్మలు, బోనాలతో ఊరేగింపుగా చెరువు కట్టల వద్దకు చేరుకున్నారు. కట్ట మైసమ్మకు, గంగమ్మ తల్లికి పూజలు చేసి, మొక్కులు చెల్లించారు.
-కరీంనగర్ నమస్తే నెట్ వర్క్