రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతో పాటు పేస్కేల్కు సంబంధించి జీవో నంబర్ 81 విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్త్తూ సోమవారం వీఆర్ఏలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
విద్యార్హత, సర్వీసు ఆధారంగా నాలుగు విభాగాల్లో వివిధ శాఖల్లో రిక్రూట్ చేయడానికి చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. రూ.10 వేలు ఉన్న వేతన్నాన్ని రూ.30 వేలకు పైగా పెంచి తమ ఉద్యోగాలకు భరోసా కల్పించారని, ఉద్యోగ భద్రతతో జీవన ప్రమాణాలు మెరుగు పడుతాయని సంతోషం వ్యక్తం చేశారు.