దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జలవనరుల శాఖ హరితహారం నిర్వహణకు సన్నద్ధ మైంది. జిల్లావ్యాప్తంగా కాకతీయ కాలువకు ఇరువైపులా 14 చోట్ల 33.65 ఎకరాల్లో 16,265 వనాలు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ఇప్పటికే గ్రామాల వారీగా స్థలాలను గుర్తించి ఫెన్సింగ్ కూడా పూర్తిచేసింది. ఇప్పటికే 4,435 గుంతలను తవ్వించింది.
– కరీంనగర్ కలెక్టరేట్, జూలై 1:
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జలవనరుల శాఖ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. కాకతీయ కాలువ వెళ్లే మండలాల్లోని గ్రామాల్లో కెనాల్కు ఇరువైపులా ఉన్న ఇరిగేషన్ శాఖ స్థలంలో మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్యాక్రాంతమవుతున్న ఇరిగేషన్ శాఖ భూములను కాపాడుకోవడంతో పాటు పండ్ల మొక్కలు నాటితే అదనపు ఆదా యం కూ డా చేకూరుతుండడం, హరితహారంలో భాగస్వాములయ్యే అవకాశముండడంతో సంపద వనాల ఏర్పాటును ఆ శాఖ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అర ఎకరం నుంచి ఐదెకరాల దాకా..
దశాబ్ది వనాల పెంపకంలో భాగంగా అర ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు భూమి సేకరించి మొక్కలు నాటేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇల్లందకుంట మండలం రాచపల్లి, టేకు ర్తి, గన్నేరువరం గ్రామాల్లో అర ఎకరం చొప్పున, తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో 0.75 ఎకరం, చిగురుమామిడి మండలం ముల్కనూర్, రామడుగు మండలం గుండి, శ్రీరాములపల్లి, గం గాధర మండలం ఇస్లాంపూర్, కేశవపట్నం మం డలం తాడికల్ గ్రామాల్లో ఎకరం చొప్పున, తి మ్మాపూర్ మండలం మహాత్మానగర్లో 1.75 ఎకరాలు, ఇల్లందకుంట మండలం మల్యాల, గం గాధర మండలం ర్యాలపల్లి, రామడుగు మం డలం లక్ష్మిపూర్ గ్రామాల్లో 2 ఎకరాల చొప్పున, సైదాపూర్ మండలం వెన్కెపల్లి, చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామాల్లో 3 ఎకరాల చొప్పున, గంగాధర మండలం గర్శకుర్తి, కొత్తపల్లి మండలం ఎలగందల్, మానకొండూర్ మండ లం ముంజంపల్లి, ఈదులగట్టేపల్లి గ్రామాల్లో ఐదు ఎకరాల చొప్పున ఇరిగేషన్ శాఖ భూమిని గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఫెన్సింగ్ కూడా చేసి, గేట్లు బిగించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 4435 గుంతలు కూడా తీశారు. ఈ స్థలాల్లో నాటేందుకు అవసరమైన మొక్కలు కూడా సమీప ప్రాంతాల్లోని నర్సరీల నుంచి సేకరిస్తున్నారు. పండ్ల మొక్కలతో పాటు దీర్ఘకాలికంగా ఆదాయాన్నిచ్చే టేకు, ఎర్రచందనం లాంటి మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు పడగానే ఉపాధి హామీ కూలీలతో మొ క్కలు నాటించనుండగా, ఆయాచోట్ల ఏర్పాటు చేసిన సంపద వనాలను పరిరక్షించేందుకు ఆశాఖలోని కిందిస్థాయి సిబ్బందికి విధులు కేటాయించనున్నట్లు తెలుస్తున్నది.
మొక్కలను సిద్ధం చేశాం..
రాష్ట్రం ఏర్పటి పదేండ్లు పూర్తయిన సందర్భం గా దశాబ్ది సంపద వనాల పేరిట తమ శాఖ ఆధీనంలోని భూముల్లో వనాలు పెంచాలని నిర్ణయించాం. జిల్లాలో 14చోట్ల స్థలాలను గు ర్తిం చాం. నీటి వసతి ఉన్న చోట ఇప్పటికే మొ క్కలు నాటగా, వర్షాధార ప్రాంతాల్లో ఒకటి, రెండు వా నలు పడగానే మొక్కలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే గుంతలు కూడా తీయగా, నాటేందుకు మొక్కలను కూడా సిద్ధం చేశాం.
– శంకర్, ఈఎన్సీ, కరీంనగర్