దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. విద్యుత్ ప్రగతి పేరిట నిర్వహించిన సభలు పండుగలా సాగాయి. విద్యుత్తు అధికారులు, ప్రజా ప్రతినిధులు బైక్ ర్యాలీలు తీశారు. మహిళా ఉద్యోగులు కరెంటు విజయంపై ముగ్గులు వేసి, బతుకమ్మలు ఆడారు. కళాకారులు ఆట పాటలతో అలరించారు. ప్రతి చోటా రైతులు, ఇతర వినియోగదారులు పాల్గొని, నాడు కోతలతో పడిన ఇబ్బందులను, నేడు నిరంతర వెలుగులతో పొందుతున్న ప్రయోజనాలను గుర్తు చేసుకున్నారు. కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని అల్గునూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, హుజూరాబాద్లో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
– కరీంనగర్, జూన్ 5(నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. విద్యుత్ ప్రగతి పేరిట సభలు నిర్వహించారు. విద్యుత్తు అధికారులు, ప్రజా ప్రతినిధులు బైక్ ర్యాలీ తీశారు. మహిళా ఉద్యోగులు కరెంటు విజయంపై ముగ్గులు వేసి, బతుకమ్మ ఆడారు. విద్యుత్ విజయోత్సవ సంబురాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గ కేంద్రాల్లో మూడు చోట్ల పండుగ వాతావరణం లో నిర్వహించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజవర్గంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ ఎస్ఈ కార్యాలయం నుంచి ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ తీశారు. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునిల్ రావు, ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ ఎస్ఈ గంగాధర్ ఈ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. రేకుర్తిలోని శుభం గార్డెన్ వరకు ర్యాలీ సాగిం ది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్తు ప్రగతి సభలో మంత్రి గంగుల, విద్యుత్తు అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యుత్తు విషయంలో రాష్ట్రంలో, జిల్లాలో సాధించిన ప్రగతిని వివరిస్తూ వీడియోను ప్రదర్శించారు. మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అల్గునూర్లోని లక్ష్మీనరసింహ గార్డెన్స్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, ఎన్పీడీసీఎల్ డీఈ తిరుపతి పాల్గొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. చొప్పదండి నియోజకవ ర్గం గంగాధర మండలం కేంద్రంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. ముందుగా గంగాధర చౌరస్తా నుంచి మధునగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం వీఏఎస్ ఫంక్షన్ హాల్లో విద్యుత్తు ప్రగతిపై సభ నిర్వహించారు. ఇక్కడ డీఈ రాజం పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నా రు. స్థానిక మధువని గార్డెన్స్లో పథకాలను తెలియజేస్తూ ముగ్గులు అలంకరించారు. మహిళా విద్యుత్తు సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో కలిసి జడ్పీ అధ్యక్షురాలు విజయ బతుకమ్మ ఆడారు.