మానకొండూర్ రూరల్, నవంబర్ 27 : ప్రతి గ్రామంలో 100 శాతం మౌలిక వసతులు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఆదివారం మానకొండూర్ మండల కేంద్రంతోపాటు లలితాపూర్, అన్నారం, కెల్లేడు, మద్దికుంట గ్రామాల్లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతోపాటు చీరెలను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
లలితాపూర్లో ప్రత్యేకంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆవిష్కరించకపోవడంతో పూర్తి పనులను చేయాలని సర్పంచ్ మర్రి కొండయ్యకు సూచించారు. మద్దికుంటలో చెక్కులను పంపిణీ చేసి, మాట్లాడారు. గ్రామాల్లో 100 శాతం మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని, అందులో భాగంగానే సీసీరోడ్లు, మహిళా భవనాలు, కుల సంఘాల భవనాల నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు.
కల్యాణలక్ష్మితో నిరుపేద ఆడబిడ్డలకు ఎంతో ధైర్యం భరోసా ఉన్నదని, ఆడబిడ్డలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా ఉండాలని కోరారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శేఖర్ గౌడ్, సర్పంచ్లు రొడ్డ పృధ్వీరాజ్, మర్రి కొండయ్య, మాతంగి పుల్లయ్య, కొత్తూరి పద్మ-జగన్ గౌడ్, మానకొండూర్ విశాల సహకార సంఘం అధ్యక్షుడు నల్ల గోవింద రెడ్డి, నాయకులు పడాల శంకరయ్య, కడారి ప్రభాకర్, గోపగోని నరేందర్, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, పిట్టల మధు, నెల్లి శంకర్, ఉప సర్పంచ్లు నెల్లి మురళి, బుర్ర శ్రీధర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ రూరల్, నవంబర్27: మండలంలోని పర్లపల్లి గ్రామంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదివారం పర్యటించారు. గ్రామస్తులతో ముచ్చటించారు. టీఆర్ఎస్ నాయకుడు చిందం చంద్రమౌళి తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి తెలిపారు. అనంతరం గ్రామస్తులతో ముచ్చటించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, ఎంపీటీసీ ముప్పిడి సంపత్రెడ్డి, ఆత్మ చైర్మన్ హర్షవర్ధన్రెడ్డి, నాయకులు హర్షవర్ధన్రెడ్డి, రావ రాజు, రాజేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.