స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్ : గాలివాన బీభత్సంతో రైతులు ఆగమయ్యారు. మంగళవారం రాత్రి 8గంటల తర్వాత అక్కడక్కడా ఈదురుగాలులతో వాన పడగా ఆందోళన చెందారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కుప్పలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఎక్కడికక్కడ వడ్లు తడిసిపోగా, కంటతడి పెట్టారు.
ఓవైపు కరెంట్ లేకపోవడం, మరోవైపు చీకట్లు కమ్ముకోవడంతో సెల్ఫోన్ లైట్ల వెలుతురులో కొట్టుకుపోయిన వడ్లను తిరిగి ఎత్తుకున్నారు. కండ్లముందే ధాన్యం కొట్టుకుపోవడం చూసి రోదించారు.

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో వర్షానికి కొట్టుకుపోయిన వడ్లను ఎత్తుతున్న రైతులు

కవర్లు కప్పినా వర్షంలో తడిసిన వడ్ల కుప్పలు