జమ్మికుంట, డిసెంబర్ 25: అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి పరంగా పెద్దపీట వేస్తున్నది ఒక్క కేసీఆరేనని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ వెంటే ప్రజలంతా ఉన్నారని స్పష్టం చేశారు. జమ్మికుంట పట్టణంలో ఆదివారం ఎమ్మెల్సీ పర్యటించారు. క్రిస్మస్ వేడుకలు, పంబా ఆరట్టు ఉత్సవాల్లో భాగంగా అయ్యప్ప శోభాయాత్రలకు హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఎమ్మెల్సీ అపర శబరిమల శ్రీఅయ్యప్ప దేవాలయానికి వచ్చారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు జయేందర్, తదితరుల ఆధ్వర్యంలో అయ్యప్పను దర్శించుకున్నారు. పంబా ఆరట్టు మహోత్సవంలో పాల్గొన్నారు.
అయ్యప్పస్వాములతో కలిసి నృత్యం చేశారు. అయ్యప్ప దేవాలయం నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వరకు చేపట్టిన శోభాయాత్రను ప్రారంభించి, అందులో పాల్గొన్నారు. తర్వాత ఆయన మున్సిపల్ పరిధిలోని సీఎస్ఐ, బెరకా, తదితర చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. కేక్ కట్ చేశారు. క్రైస్తవులకు కేక్, ప్రభుత్వం నుంచి వచ్చిన కానుకలను పంపిణీ చేశారు. తర్వాత జరిగిన ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ మాట్లాడారు. ఆలయాలకు, చర్చిలకు నిధులు వచ్చాయని, గొప్పగా తీర్చిదిద్దుకుందామని పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వీణవంకలో..
వీణవంక, డిసెంబర్ 25: మండలంలోని వల్భాపూర్, ఘన్ముక్ల, వీణవంక గ్రామాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్మస్ కేక్కట్ చేశారు. ఘన్ముక్లలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యం ఇస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నదన్నారు. రానున్న రోజుల్లో శాసన సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని, బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, సర్పంచులు జున్నూతుల సునీత-మల్లారెడ్డి, నీల కుమారస్వామి, రఘుపాల్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ మధుసూదన్రెడ్డి, ఉప సర్పంచులు వోరెం భానుచందర్, కొమురయ్య, నాయకులు దేశిని కోటి, రమేశ్, అఖిల్, మాదాసి సునీల్, పాస్టర్లు రాంలింగారెడ్డి, జయరాజ్ కిష్టఫర్, సామేల్, క్రైస్తవులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ మండలంలో..
హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 25: మండలంలోని చెల్పూర్, రంగాపూర్, రాంపూర్, మందాడిపల్లి తదితర గ్రామాల్లోని చర్చిల్లో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చెల్పూర్ చర్చిలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా చెల్పూర్ చర్చి అభివృద్ధి కోసం శాలపల్లి-ఇందిరానగర్ సర్పంచ్ కొడుగూటి శారద-ప్రవీణ్ రూ.లక్ష విలువైన చెక్కుతో పాటు, క్రైస్తవ మహిళలకు రూ.30వేల విలువైన చీరలను ఎమ్మెల్సీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా చర్చిల పాస్టర్లు పాల్గొన్నారు.
జమ్మికుంట మండలంలో..
జమ్మికుంట రూరల్, డిసెంబర్ 25: మండలంలోని మడిపల్లి కల్వరిప్రేయర్ ఫెలోషిప్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ జాన్ మార్క్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాయంపేటలోని బిలీవర్స్ చర్చిలో పాస్టర్ సత్యరాజ్ క్రిస్మస్ పండుగ విశిష్టతను భక్తులకు వివరించారు. బైబిల్ పఠనం చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. అంతకుముందు క్రిస్టియన్లు పరస్పరం క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. వేడుకల్లో సర్పంచులు ఆకినపల్లి సుజాతాభద్రయ్య, పరశురాములు, కల్వరి ప్రేయర్ ఫెలోషిప్ కమిటీ అధ్యక్షుడు రాజ్గోపాల్ , మత పెద్దలు స్వామిదాసు, తిమోతి, ఆనందంతో పాటు క్రిస్టియన్లు పాల్గొన్నారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట, డిసెంబర్ 25: మండలంలోని సిరిసేడు, ఇల్లందకుంట, మల్యాల, కనగర్తి, బుజూనూర్, రాచపల్లి, టేకుర్తి గ్రామాల్లోని చర్చిల్లో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. వేడుకల్లో ఆయా గ్రామాల సర్పంచులు రఫీఖాన్, మట్ట రజితావాసుదేవారెడ్డి, అరుణాసదానందం, వనమాలావాసు, ఎంపీటీసీలు రేణుకుంట్ల చిన్నరాయుడు, ఎక్కటి సంజీవరెడ్డి, పాస్టర్లు సామేల్, దేవదాసు, సదానందంతో పాటు క్రైస్తవులు పాల్గొన్నారు.
హుజూరాబాద్లో..
హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 25: పట్టణంలోని అన్ని చర్చిల్లో క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ ఫౌండర్ చైర్మన్ రెవరెండ్ నాగిశెట్టి డానియల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హాజరై, క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, 17వ వార్డు కౌన్సిలర్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
సైదాపూర్లో..
సైదాపూర్, డిసెంబర్ 25: మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మండలకేంద్రంలోని వెన్కేపల్లిలో జరిగిన వేడుకలకు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి హాజరై, కేక్ కట్ చేశారు. స్వీట్లు పంచారు. అనంతరం ప్రభుత్వం తరఫున క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచులు కొండ గణేశ్, తాటిపల్లి యుగేందర్రెడ్డి, పాస్టర్ పెద్దెల్లి డేవిడ్, పెద్దెల్లి అశీష్, ఆశీర్వాదం, ఆదాము, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.