Chalmeda Lakshmi Narasimha Rao | వేములవాడ, మే 4 : అబద్దాల హామీతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వేములవాడ రూరల్ చెందిన క్రికెట్ క్రీడాకారులకు సోమవారం క్రికెట్ కిట్ లను అందజేసి మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తుందని అన్నారు. మళ్లీ మరోసారి సీఎంను కేసీఆర్ చేయాలని యువత చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, క్రీడాకారులను ప్రోత్సహించడానికి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ లో కాంగ్రెస్ కరువు ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నరని, అబద్దపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మర్చిపోయాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోసారి కెసిఆర్ ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. కేటీఆర్ ముఖ్యమైన మంత్రి, ఆయన సహకారంతో రానున్న రోజుల్లో వేములవాడ ను అభివృద్ధి చేసుకుందామన్నారు. కేసీఆర్ కప్ తో క్రికెట్ క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తి పెంపొందడమే కాకుండా గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులు తమ ప్రతిభను చాటారన్నారని కొనియాడారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపేందుకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందున్నారని గుర్తు చేశారు. క్రికెట్ ఏ కాకుండా భవిష్యత్తులో కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ల నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు.
టోర్నమెంట్ లో పాల్గొన్న అన్ని జట్లకు కేటీఆర్ ఆదేశాల మేరకు క్రికెట్ కిట్లను అందజేసి వారికి ప్రోత్సాహంగా ఉండడమే కాకుండా భవిష్యత్లో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులను వెలికి తీస్తామని తెలిపారు. అనంతరం యువతకు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై అవగాహనా కల్పించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి చల్మెడ ఎప్పుడు అండగా ఉంటారని, హాస్పిటల్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నరని కొనియాడారు. వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు చల్మెడ వస్తే అభివృద్ధి జరుగుతుందే, కేసీఆర్ వస్తే కరువు లేకుండె అంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు చల్మెడ కే పట్టం కడుతారని, పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గోస్కుల రవి, గడ్డం హనుమాన్లు, ఏష తిరుపతి, మల్లేశం, బాల్ రెడ్డి, యవకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.