గంగాధర, మార్చి 13 : వరదకాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. గంగాధర మండలం మధురానగర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలన లో చొప్పదండి నియోజకవర్గం మరో కోనసీమగా మారిందని, వరదకాలువ జీవనదిని తలపించిందని గుర్తు చేశారు. వేలాది ఎకరాలకు సాగునీరందించి, పంటలను కాపాడిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. వరదకాలువకు 25 ఓటీలను నిర్మించి చెరువులను నింపుకొన్నామన్నారు. కానీ, కాంగ్రెస్ పాలనవచ్చి రైతులకు కన్నీళ్లు, కష్టాలను తెచ్చిందన్నారు. మేడిగడ్డ వద్ద ప్రతిరోజూ ఐదువేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రెండు రోజుల్లో నీటిని విడుద ల చేయకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రా వు, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్లు లోకిని ఎల్లయ్య, సాగి మహిపాల్రావు, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్రెడ్డి, మాజీ సర్పంచులు కంకణాల విజేందర్రెడ్డి, వేముల దా మోదర్, ముక్కెర మల్లేశం, నాయకులు దోమకొండ మల్లయ్య, సామంతుల శ్రీనివాస్, సముద్రాల అజయ్, గంగాధర కుమార్, అబ్బాస్, గంగాధర శ్రీకాంత్ పాల్గొన్నారు.