వెల్గటూర్, ఆగస్టు 26: రాష్ర్టాన్ని ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిండా ముం చింది. ఏ ఒక్క పనీ చేయలేదు. ఆ పార్టీ నాయకులకు అభివృద్ధిపై సోయే లేదు. మళ్లీ ఇప్పుడు మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నరు..? వాళ్లు అధికార కోసం ఆరాట పడుతుంటే.. బీఆర్ఎస్ మాత్రం అభివృద్ధి పోరాటం చేస్తున్నామని’ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. బీజేపీది అదే పరిస్థితి అని, వాళ్లకూ ఏం చేతకాదని, కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ర్టానికి చేసిందేమీలేదని దుయ్యబట్టారు.
మంగళవారం ఎండపల్లి మండలం సూరారం, గొడిసేలపేట గ్రామాల్లో ప్రజా ఆశీర్వాదయాత్ర చేశారు. ముందుగా సూరారంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయగా, మహిళలు మంగళ హారతులు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటా ప్రచారం చేశారు. తర్వాత గొడిసేలపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో నంబర్ వన్గా నిలిచిందన్నారు.
మాయ మాటలు చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరో అవకాశం ఇవ్వాలని వస్తున్నారని, ఇంకా నమ్ముతారా..? అంటూ ప్రశ్నించారు. వాళ్లకు దళితులను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏనాడూ రాలేదన్నారు. కేవలం ఓటు బ్యాంక్గానే చూశారు తప్ప ఉన్నతిలోకి తేవాలని అనుకోలేదని మండిపడ్డారు. కానీ సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం రూ. 21 వేల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.
ఈ రోజు అభివృద్ధికి కేరాఫ్ అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ‘నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా అండగా ఉంటూ, మంత్రిగా కాకుండా ఓ సాధారణ వ్యక్తిగా మీలో ఒకడిగా ఉంటున్న నన్ను మరోసారి ఆశీర్వదించాలి. భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపి తే మీ ఆత్మబంధువుగా ఉంటూ కడుపులో పెట్టి కాపాడుకుంటానని చెప్పారు.
కార్యక్రమంలో సర్పంచ్ మెతుకు స్వరూప-స్వామి, ఎంపీపీ కునమల్ల లక్ష్మి, వైస్ ఎంపీపీ కవిత-దేవేందర్రెడ్డి, సర్పంచ్లు గంగుల నగేశ్, యాగండ్ల తిరుపతి, పోన్నం స్వరూప-తిరుపతి, మండల పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్, మండల యువత అధ్యక్షులు బిడారి తిరుపతి, రామగిరి మల్లేశ్, నాయకులు ఏలేటి కృష్ణారెడ్డి, మూగల సత్యం, మ్యాకల సంతోశ్, అల్లే వెంకటేశ్, అరికిల్ల మహేందర్, సింధూజరెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, పెద్దూరి భరత్కుమార్, పడిదం మొగిళి, రవి, తిరుపతి, చుంచు మల్లేశ్, మంగ, అంజీ, రాజేశం,సంగ రమేశ్, రామయ్య, చరణ్, సతీశ్, కూస మధుకర్, రామయ్య, సుందర్, మహిళలు పాల్గొన్నారు.