రాష్ట్ర సర్కారు మరోసారి రైతుల పక్షపాతిగా రుజువుచేసుకున్నది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని దుఃఖంలో ఉన్న మక్క రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా యాసంగిలో పండిన మక్కలు కొనాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లకు సంబంధిత అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా కరీంనగర్ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో 7, పెద్దపల్లిలో 5 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల ఒకటి నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని కరీంనగర్ మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్రెడ్డి తెలిపారు. రెండు జిల్లాల్లో 62 వేల క్వింటాళ్లకుపైగా కొనుగోలు జరిగే అవకాశాలుండగా, రైతులకు కనీస మద్దతు ధర 1,962 దక్కనున్నది.
– కరీంనగర్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ)
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం
నేను ఈ సారి రెండెకరాలల్ల మక్క వేసిన. పంట మంచిగ పండి చేతికచ్చే టైంల అకాల వర్షాలు కొంత దెబ్బతీసినయ్. రెండు మూడేండ్ల నుంచి మార్క్ఫెడ్ మక్కలు కొనకపోవడంతో దళారులు ఇష్టారీతిలో ధరలు పెడుతున్నరు. క్వింటాకు 1,800లోపే ఇస్తున్నరు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సారు ప్రభుత్వం కొంటదని చెప్పి మాకు భరోసానిచ్చిండు. క్వింటాకు 1,962 మద్దతు ధర ఇస్తామని నిర్ణయించిండు. మక్క ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తది. ఇప్పుడు మార్క్ఫెడ్ ఏర్పాటు చేసే కేంద్రాల్లో అమ్మితే నాకు ఎకరాకు 7వేల నుంచి 8 వేల వరకు మిగులుతయ్. అంటే ఈసారి నాకు 14 వేల నుంచి 16 వేల లాభం వస్తది. మంచి నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం. మార్క్ఫెడ్ సార్లకు నా కృతజ్ఞతలు.
– గాండ్ల లక్ష్మణ్, మంగళపల్లి (చొప్పదండి)
కరీంనగర్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : మక్క రైతులను ఆదుకునేందుకు మక్కలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా మక్క కొంత దెబ్బతిన్నది. కరీంనగర్ జిల్లాలో ఈసారి యాసంగిలో 19,884 ఎకరాల్లో సాగైం ది. అకాల వర్షాల కారణంగా వెయ్యి ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. అంతే కాకుండా, ప్ర తి చేను పాక్షికంగా దెబ్బతిన్నది. అకాల వర్షాలకు ముందు క్వింటాల్కు రూ.2,220 నుంచి రూ. 2,400 వరకు ధర పెట్టి వ్యాపారులు కొనుగోలు చేశారు. వర్షాలు కురిసి పంట దెబ్బతినడంతో నా ణ్యత తగ్గిందని ఏకంగా రూ.1,600 నుంచి రూ. 1,800లకు తగ్గించారు. మూలిగే నక్కపై తాటిపం డు పడ్డ చందంగా వానల కారణంగా దెబ్బతిన్న పంటలతో నష్టపోయిన రైతులకు వ్యాపారులు తీ సుకున్న నిర్ణయం పుండు మీద కారం చల్లినట్ల యింది. ఈ నేపథ్యంలో మక్క రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేయాలని నిర్ణయించారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,962 చొప్పున చెల్లించాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు రావడంతో కరీంనగర్ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు జిల్లాల్లో 12 కేంద్రాలు
కరీంనగర్ మార్క్ఫెడ్ పరిధిలోని కరీంనగర్లో 7, పెద్దపల్లిలో 5 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 60 వేల టన్నుల మక్కల దిగుబడి వస్తుందని అంచనా వేయగా, ఇప్పటికే 26 వేల టన్నులు పలు రకాలుగా కొనుగోళ్లు జరిగా యి. ఇక మిగిలిన 34 వేల టన్నుల దిగుబడులను కొనుగోలు చేసేందుకు జమ్మికుంట, మానకొండూర్, కొత్తపల్లిలో డీసీఎంఎస్ ద్వారా, చొప్పదం డి, సైదాపూర్లో స్థానిక పీఏసీఎస్ల ద్వారా కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. డీసీఎంఎస్ ద్వారా చిగురుమామిడి, గన్నేరువరం మండల కేంద్రాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అయి తే, అవసరం అనుకుంటేనే వీటిని ప్రారంభిస్తామని మార్క్ఫెడ్ డీఎం తెలిపారు. ఇక పెద్దపల్లి జి ల్లాలో 30 వేల టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఇందులో ఇప్పటికే 2 వేల టన్నులు వివిధ రూపాల్లో మార్కెటింగ్ జరిగింది. మిగిలిన 28 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు సుల్తానాబాద్, జూలపల్లిలో పీఏసీఎస్ల ద్వారా, పెద్దపల్లి, శ్రీరాంపూర్లో డీసీఎంఎస్ ద్వారా కొనుగోళ్లు చేయనున్నారు. వచ్చే నెల 1 నుంచి కొనుగోళ్లు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని డీఎం వెల్లడించారు.
ఆపద టైంల ఆదుకుంటున్నరు
అకాల వర్షాలు, వడగండ్లతోని రైతులు చానా నష్టపోయిన్రు. వడ్లు కొనడంలో ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసింది. ఇప్పుడు మక్కలు కొనడానికి సుతం ముందుకు రాలేదు. సీఎం కేసీఆరే మళ్లోసారి మక్కలు కొంటామని అనడం చాలా సంతోషకరం. మా మండల కేంద్రంల మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం మరింత సంతోషంగున్నది. మంచి ధర పెట్టి మక్కలు కొంటామని చెప్పినంక ఊరట వచ్చింది.
– బానోతు రమేశ్నాయక్, రాయికల్ తండా (సైదాపూర్)
ఎట్ల అమ్ముడో అని భయపడ్డం
ఓ దిక్కు చెడగొట్టు వానలు వడుతున్నయ్. ఇంకో దిక్కు మక్కల ధర తగ్గించిండ్రు. ఎట్ల అమ్ముకును డో అని భ యపడ్డం. కొం టమని కేసీఆర్ చెప్పడంతో ప్రాణం లే చివచ్చింది. కేసీఆర్ సార్ నీళ్లిచ్చిండు, ఉచిత కరెంటిచ్చిండు. పెట్టువడికి పైసలు ఇస్తుండు. నేను రెండెకరాల్ల మక్కేసిన. మొన్ననే కోసిన. నాలుగు ట్రిప్పు ల కంకులు ఎల్లినయ్. కేంద్రం కొననని చెప్పితే చాలా మంది నా లెక్కనే భయపడ్డరు. కేసీఆర్ సా రుకు రైతులంతా రుణపడి ఉంటరు. మాకు అం డగ నిలుస్తున్నందుకు ధన్యవాదాలు.
– ఔరుగొండ ఎల్లయ్య, ఖాదర్గూడెం (మానకొండూర్)
రైతులను ఆదుకునే సర్కారు
కేసీఆర్ ప్రభుత్వమంటే రైతుల పక్షాన నిలబడేదని మరోసారి రుజువైంది. మక్కల కొంటమని నిర్ణయించడం సంతోషం. ఆరుతడి కింద ఈసారి మేం రెండెకరాల్ల మక్క పెట్టినం. మొన్ననే కోసినం. దిగుబడి బాగా వచ్చింది. గతంల మక్కలను దళారులకు అగ్గువ ధరకు అమ్ముకొని నష్టపోయినం. ఇప్పుడు సర్కారు క్వింటాల్కు రూ.1,962 మద్దతు ధర ఇచ్చి కొంటమని చెప్పినంక సంతోషమనిపించింది. మక్క రై తులు నష్టపోవద్దని సీఎం సార్ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది రైతులకు మేలు చేస్తది.
-బీ పద్మ, మహిళా రైతు, బద్దిపల్లి (కొత్తపల్లి)