కలెక్టరేట్, ఆగస్టు 28 : కరీంనగర్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి టీఎస్ఓబీఎంఎస్ ద్వారా దివ్యాంగులకు(చెవిటి వారు) మంజూరైన మొబైల్ ఫోన్లను సోమవారం కలెక్టరేట్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్ బీ గోపితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ టీఎస్ఓబీఎంఎస్ ద్వారా జిల్లాలో 51 శాతం కంటే ఎకువ చెవిటి ఉన్న ఐదుగురికి మొబైళ్లను అందించినట్లు చెప్పారు. ఇందులో ఇంటర్ లేదా డిస్టెన్స్ చదివే 16 నుంచి 21 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారు, డిగ్రీ ఆ పై చదువుతున్న18 నుంచి 25 ఏండ్ల వయసున్నవారు, 16 నుంచి 50 ఏండ్ల పైబడి ఎస్సెస్సీ చదివిన వారిని అర్హులుగా గుర్తిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రఫుల్ దేశాయ్, ఇతర అధికారులు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.