తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలు విజయవంతమయ్యాయి. ఈ నెల 2న (రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం) మొదలైన కార్యక్రమాలు, 21 రోజల పాటు రోజుకో తీరున పండుగలా సాగాయి. సబ్బండ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనగా, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలు, ప్రగతిని వివరించారు.
ఉమ్మడి జిల్లాలో వేడుకలకు మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాగా, ఆయాచోట్ల సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం అమరుల సంస్మరణతో గ్రాండ్ సక్సెస్గా ముగిశాయి.
– కరీంనగర్, జూన్ 22 (నమస్తే తెలంగాణ)