కొడిమ్యాల, అక్టోబర్ 21 : మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో శుక్రవారం 55వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలను ఖోఖో అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి, అల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహణ అధ్యక్షుడు, సర్పంచ్ ఏలేటి మమత- నర్సింహారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లాల నుంచి 20 జట్లు పాల్గొన్నాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, పావురాలను ఎగరేసి క్రీడాపోటీలను ప్రారంభించారు. కొడిమ్యాల ఇండో స్కూల్, విస్డమ్ పాఠశాలలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
పలువురు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలన్నారు. క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, ఎంపీటీసీ సభ్యురాలు జమాల్పురి రాజేశ్వరి, ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మహేందర్రావు, ప్రధానోపాధ్యాయులు నాంపల్లి మల్లేశం, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రఘుపతి రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాస్, శ్యాంప్రసాద్, పోచప్ప, కృష్ణప్ప, స్థానిక క్రీడాకారులు రవీందర్, కృష్ణంరాజు, బల్ల మల్లేశం, డేవిడ్సన్, లక్ష్మణ్, అనిల్, మోహనాచారి, గుర్రం నర్సయ్య తదితరులు ఉన్నారు.