కమాన్చౌరస్తా, ఆగస్టు 25 : ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమయ్యింది. గతంలో టీచ ర్ పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేసింది. ప్రస్తుతం పాత పద్ధతిలో డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ) జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్గా, డీఈవో సెక్రటరీగా, సీఈవో సభ్యులుగా ఉండే కమిటీ ద్వారా డీఎస్సీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 393 ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కరీంనగర్కు 99, జగిత్యాలకు 148, రాజన్న సిరిసిల్లకు 103, పెద్దపల్లి జిల్లాకు 43 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవుతున్నట్లు తెలిసింది.
అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి పంపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లాలో 99 ఖాళీలు ఉండగా స్కూల్ అసిస్టెంట్ 22, ఎస్జీటీ 52, లాంగ్వేజ్పండిట్ 18, పీఈటీ 7 పోస్టులు మొత్తం 99 ఖాళీలు ఉన్నాయి. అలా గే, జగిత్యాల జిల్లాలో 50 స్కూల్ అసిస్టెంట్, 53 ఎస్టీజీ, 37 లాంగ్వేజ్పండిట్, 8 పీఈటీ, మొ త్తం 148, రాజన్న సిరిసిల్లలో 23 స్కూల్ అసిస్టెంట్, 64 ఎస్జీటీ, 12 లాంగ్వేజ్పండిట్, 4 పీ ఈటీ, మొత్తం 103, పెద్దపల్లి జిల్లాలో 30 స్కూల్ అసిస్టెంట్, 7 ఎస్జీటీ, 5 లాంగ్వేజ్పండిట్, 1 పీఈటీ, మొత్తం 43 ఖాళీలుగా గుర్తించిన అధికారులు, ఆ నివేదికను విద్యాశాఖకు పంపించారు. కాగా, తెలంగాణ టెట్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. ఇక టీఎస్ టెట్ పరీక్షను సెప్టెంబర్ 15న నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేస్తారు.