Chinnakalvala | సుల్తానాబాద్ రూరల్, జూన్ 2 : రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చిన్న కల్వల సింగిల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మంగళవారం సీఈవో వల్ల కొండ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మోహన్ రావు హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు.
పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని దేవునిపల్లి, కొదురుపాక, వాగొడ్డుపల్లి, నారాయణపూర్, చిన్నకల్వల , చిన్న బొంకూర్, మియాపూర్, రెబల్దేవ్పల్లి, పెరికపల్లి,గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన దాన్యం ఇప్పటివరకు 85 వేల 325 క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించినట్లు చెప్పారు. ఇందుకు సహకరించిన సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీఎస్వో శ్రీనాథ్ రెడ్డి, సహకార అధికారి, ఆయా గ్రామాల సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, రైతులు, హమాలీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.