హుజూరాబాద్/ హుజూరాబాద్టౌన్, ఏప్రి ల్ 25: అభివృద్ధే బీఆర్ఎస్ ఎజెండాఅని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను ఆవిషరించిన అనంతరం వినోద్ కుమార్ మాట్లాడారు. 2001లో తెలంగాణలో ఎకువగా రైతు ఆత్మహత్యలు ఉండేవని, ఆ సమయంలోనే గ్రామాల్లోని యువకులను నక్సలైట్ల పేరుతో పోలీసులు వేధింపులకు గురిచేసేవారని గుర్తు చేశారు. ‘నిత్యం రక్తపాతం’ అనే వార్తలు పేపర్లలో వచ్చేవని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల బతుకులు మెరుగు పడ్డాయన్నారు. గ్రామాల్లోని యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించాయన్నారు. నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పార్టీనే అని, కేవలం ఇద్దరు ఎంపీలతో దేశంలో 22 పార్టీలను ఒప్పించి పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టించిన ఘనత బీఆర్ఎస్దని సగర్వంగా చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో కరెంటు ఉండదని విమర్శించిన నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి దమ్ముంటే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో హుజూరాబాద్కు వచ్చి కరెంటు వైర్లపై బట్టలు ఎండేసి చూడాలని సవాల్ విసిరారు.
కరెంటు వాడకంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి వరుసలో ఉందని, ఇది ప్రజల అభివృద్ధికి నిదర్శనమన్నారు. 2001లోనే రామప్ప చెరువు చూసిన కేసీఆర్ మిషన్ కాకతీయకు ప్రణాళిక వేశారని, రాష్ట్రం ఏర్పడ్డాక 44 వేల చెరువులు, కుంటలను మరమ్మతు చేశామని చెప్పారు. ఈ పథకంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని, రెండేళ్ల కరువు వచ్చినా భూమి లోపల 800 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో గోదావరి నదిపై నిచ్చెనలాగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని, కాళేశ్వరం ప్రాజెక్టుతో 120 అంతస్తులు ఎత్తుగా ఉన్న ప్రాంతానికి పంపుల ద్వారా నీరు పంపింగ్ అవుతున్నదని, తద్వారా కోటి ఎకరాలకు సాగునీరందించిన ఘనత కేసీఆర్ది కాదా? అని ప్రశ్నించారు. కరెంట్ కొనే రోజుల నుంచి మన మే ఇంకో రాష్ట్రానికి విక్రయించే స్థాయికి ఎదిగామన్నారు. నిత్యావసర ధరలు పెంచి కేంద్రం ప్రజలపై భారం మోపుతున్నదని మండిపడ్డారు. 2014 నుంచి నేటి వరకు డీజిల్, పెట్రోల్పై సెస్ రూపంలో తెలంగాణ రాష్ట్రం రూ.39 వేల కోట్లు కేంద్రానికి చెల్లించిందని, కేంద్రం ఇప్పటివరకు రూ.34 వేల కోట్లు ఇచ్చిన విషయాన్ని మొన్న అమిత్షా చెప్పారని, ఆయన లెక్క ప్రకారం మిగతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలోని అనేకమంది బ్యాంకు దోపిడీదారులకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల ఉద్యోగ భర్తీ చేసిందని, మరో 80వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను ఇచ్చిందని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, కాజీపేటలో కోచ్ ప్యాక్టరీ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. ఎల్లాపూర్ – కరీంనగర్ నూతన రైల్వేలైన్ సర్వే అయిపోయి రిపోర్ట్ పంపినా మళ్లీ రీ సర్వే అంటూ.. గ్రీన్ సిగ్నల్ అని బండి సంజయ్ అంటుండడం విడ్డూరంగా ఉందన్నారు. తానే ఎంపీగా ఉంటే ఈ రోజున ఎల్లాపూర్-కరీంనగర్ రైల్వే లైన్ అయిపోతుండేదని, భవిష్యత్తులో అదిలాబాద్ వరకు లోకల్ రైలు కూడా నడిచేందుకు ప్రణాళికలు జరిగేవన్నారు. విదేశాలకు వెళ్లిన నీరవ్మోదీని, విజయ్ మాల్యాను ఎందుకు తీసుకు రావట్లేదని, ఈ రోజు అదానీ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయని నిలదీశారు. అదానీ ఆస్తులపై పార్లమెంట్లో కమిటీ వేయమంటే ఎందుకు తాత్సారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు 300లు లేని మెడికల్ కాలేజీ సీట్లు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకొని 8000 సీట్ల వరకు పెంచుకున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ ఎకడా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదని, బీజేపీ పరిపాలిస్తున్న ఒకరాష్ట్రంలోనైనా తెలంగాణ పథకాలు ఉన్నాయో ఈటల రాజేందర్ను ప్రశ్నించలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని, మన ప్రత్యర్థి రాజకీయం మాట్లాడితే మనం ఎందుకు మాట్లాడవద్దని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ జెండావిష్కరణ
ప్లీనరీకి ముందు హుజూరాబాద్లోని పట్టణ బీఆర్ఎస్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ జెండావిష్కరించగా, మినీ ప్లీనరీ వద్ద మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పార్టీ జెండాను ఎగుర వేశారు. అనంతరం తెలంగాణ అమరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అలాగే, వీణవంక మండలానికి చెందిన పార్టీ కార్యకర్త మరణించగా, ఆయన కుటుంబ సభ్యులకు 2 లక్షలు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి తీర్మానం చేయగా, కార్యకర్తలు చప్పట్లు కొట్టి అంగీకరించారు. సమావేశంలో కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, జమ్మికుంట చైర్మన్ టీ రాజేశ్వర్రావు, వైస్ చైర్పర్సన్లు కొలిపాక నిర్మల, దేశిని స్వప్న కోటి, బీఆర్ఎస్ మహిళావిభాగం అధ్యక్షురాలు కల్లెపల్లి రమాదేవి, సోషల్మీడియా జిల్లా, మండల ఇన్చార్జిలు గొడిశాల పావ ని, టీ లక్ష్మణమూర్తి, సింగిల్విండో చైర్మన్ ఎడవెల్లి కొండాల్రెడ్డి, ఎంపీపీలు ఇరుమల్ల రాణిసురేందర్రెడ్డి, పావని, మమత, జడ్పీటీసీలు బక్కారెడ్డి, శ్రీరాం శ్యామ్, సాదవరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు పరిపాటి రవీందర్రెడ్డి, వొడితల ప్రణవ్బాబు, పట్టణ, మండల శాఖల అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సంగెం ఐలయ్య, రాజ్కుమా ర్, ఐదు వేలకుపైగా కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్పాలన దేశానికే ఆదర్శం
సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారు. దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని, పూర్తిస్థాయిలో అమలు చేశారు. ఈ పథకం వల్ల అనేక మంది కుటుంబాల్లో వెలుగులు నింపారు. గుమస్తాలుగా ఉన్న వారే ఓనర్లుగా మారారు. ఈ పథకంపై దేశంలోని దళితుల్లో పెద్ద చర్చ జరుగుతున్నది. దళితులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి దళిత వ్యక్తిపై ఉన్నది.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి గెలిపించుకునేందుకు నేటి నుంచే సన్నద్ధం కావాలి.
– బండ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
దళితజాతి ఉద్దరణకు ఆధ్యుడు కేసీఆర్
దళితజాతి ఉద్దరణకు పుట్టిన మహనీయుడిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా చరిత్రలో నిలిచింది. తొమ్మిదేళ్లలోనే కరెంటు కష్టాలను తొలగించి, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించే స్థాయికి తేవడం సీఎం కేసీఆర్కే దకుతుంది. సాగు నీటి వ్యవస్థలో విప్లవాత్మకమైనవి చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడున్నరేండ్లలోనే నిర్మించి యావత్ ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా చేశారు. ఐటీ రంగంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అనేక పెట్టుబడులు సాధించి పెట్టారు. దిగ్గజ కంపెనీలు సైతం మన హైదరాబాద్ నగరంలో స్థాపించేలా చేశారు.
– కనుమల్ల విజయ, జడ్పీ చైర్పర్సన్
ఎమ్మెల్యే సీటు గెలిచి సీఎంకు గిఫ్ట్గా ఇద్దాం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఓటమి లక్ష్యంగా ప్రతి ఒకరూ పనిచేయాలి. నన్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్ల నిధులు తెస్తా. గతంలో మంత్రిగా పని చేసినా ఈటల రాజేందర్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ప్రతి మంత్రి నియోజకవర్గం అభివృద్ధికి చిరునామాగా మారితే ఇకడ మాత్రం ఎందుకు జరగలేదు. కేసీఆర్ పుణ్యమా అని నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. నియోజకవర్గంలో ప్రతి నెలా 43,516 మందికి పింఛన్లు, ఇప్పటి వరకు 10వేల మందికి కేసీఆర్ కిట్లు, 9,500 మందికి కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్, రైతు బంధు, బీమా వంటి పథకాల కోసం రూ.వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది.
వేం నరేందర్రెడ్డి కొడుకు ఎంగేజ్మెంట్లో ఈటల రాజేందర్, రేవంత్రెడ్డి మధ్య లెజెండ్ అగ్రిమెంట్ జరిగిందని నేను ముందే చెప్పా. ఈటల రాజేందర్ రూ.25 కోట్లు రేవంత్కు ఇచ్చాడనేది నిజం. దీనిని ఈటల బీఆర్ఎస్ ఇచ్చిందని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై రేవంత్రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేశాడు. ఈటల ఇవ్వలేదని మాత్రం చెప్పలేదు. ఇప్పటికైనా ఇవ్వలేదని భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ఈటల ప్రమాణం చేయాలి. మున్సిపల్ చైర్పర్సన్, ఇతర బాడీలకు అవిశ్వాస తీర్మానాలు లేవు. ఇది సీఎం కేసీఆర్ చెప్పారు. దీనిని ప్రతి ఒక్క నాయకుడూ పాటించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల్లారా బీఆర్ఎస్ కార్యకర్తలపై చేయి వేస్తే ఊరుకునేది లేదు. మా కార్యకర్తలదే అంతటా హవా నడుస్తది.. ఎదుటోడు ఫ్రస్టేషన్లో పిచ్చిపిచ్చి మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క కార్యకర్త తగిన సమాధానం చెప్పాలి.
– పాడి కౌశిక్రెడ్డి, మండలి విప్