ఇల్లంతకుంట, నవంబర్ 5: ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇస్తూ.. అధికారం కోసం పాకులాడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన పెద్దలింగాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటక గతే వస్తుందన్నారు.
వ్యవసాయానికి కేవలం ఐదు గంటల కరెంటే ఇస్తున్నామంటూ.. ఆ రాష్ట్ర మంత్రులే చెబుతున్నారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటలు కరెంటు, రైతుబంధు, రుణమాపీ, పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు.
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీవన్నీ అబద్ధపు హామీలేనని, వారిని నమ్మితే గోసపడుతామని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న, గడ్డం నాగరాజు, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్ గౌడ్, సర్పంచులు సిద్ధం శ్రీనివాస్, గొడిసెల జితేందర్గౌడ్, పొన్నం తిరుపతి, కంకటి మధునవ్వ, నాయకులు పాల్గొన్నారు.