కార్పొరేషన్, అక్టోబర్ 6: కరీంనగర్లో ప్రజలకు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడంతో పాటు పచ్చదనం, ఆహ్లాదకర పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 28, 36, 16వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం రాత్రి ఆయన భూమిపూజ చేశారు. అలాగే, జ్యోతినగర్లో కఠారి దేవేందర్రావు (కేడీఆర్) పార్క్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మన నీళ్లు, నిధులను దోచుకొని తెలంగాణను గుడ్డిదీపం చేసి ఆంధ్రా ప్రాంతాలను అభివృద్ధి చేసుకుని మన బిడ్డల భవిష్యత్పై దెబ్బ కొట్టారని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కండ్లు, కడుపు మండుతున్నదని, ఆంధ్రా ముసుగులో మళ్లీ రాష్ట్రాన్ని దోచుకునేందుకు గద్దల్లా హైదరాబాద్ నగరంలో తిష్ట వేశారని తెలిపారు.
రాష్ట్రాన్ని ఢిల్లీ పాలకులైన కాంగ్రెస్, బీజేపీలకు అప్పగిస్తే మన సంపద దోచుకొని తెలంగాణ బిడ్డల భవిష్యత్ అంధకారం చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నగరానికి రూ. వేల కోట్లు తెచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో ఎకడ చూసినా అందమైన సీసీ రోడ్లు, చకటి డ్రైనేజీ వ్యవస్థ, వెలుగుల జిలుగులతో సుందరంగా తయారైందన్నారు. ఓ వైపు ఐటీ టవర్, సుందరమైన కూడళ్లు, తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లు తెచ్చి నగర రూపు రేఖలు మార్చామన్నారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలంటే, ఇలాగే అభివృద్ధి కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగాలన్నారు.
కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి తనను ఆశీర్వదించాలన్నారు. మీరు ఒక ఓటు వేయండి, ఐదేళ్లు మీకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. మేయర్ వై సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు హరిశంకర్, కార్పొరేటర్లు నాంపెల్లి శ్రీనివాస్, గుగ్గిళ్ల జయశ్రీ, శ్రీనివాస్, బోనాల శ్రీకాంత్, రాపర్తి విజయ, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.