Murder | పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 21 : ఓ కొడుకు కన్న తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి పట్టణంలోని ఈద్గా కాలనీకి చెందిన లారీ డ్రైవర్ సయ్యద్ జుబేర్ కు ఇద్దరు భార్యలు ఉన్నారు. కాగా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు.
రెండో భార్యకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా కుటుంబసభ్యుల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జుబేర్ ను మొదటి భార్య కొడుకు హత్య చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సంఘటన స్థలానికి పెద్దపల్లి టౌన్ పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.