Korutla | కోరుట్ల, జనవరి 29 : కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామికమని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. బహ్రెయిన్ లో ఎన్నారై నాయకులు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా, రాజకీయ ఒత్తిళ్లతో నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు.
కేసీఆర్ కేవలం ఒక వ్యక్తి కాదు అని తెలంగాణ రాజకీయ ప్రతీక అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేసీఆర్పై నిందలు వేయాలని అడుగడుగునా రాజకీయ కుట్ర చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం మీద, న్యాయవ్యవస్థ మీద మాకు పూర్తి విశ్వాసం ఉందని, నిజం తప్పకుండా బయటపడుతున్నారు. ఈ తరహా చర్యల ద్వారా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించాలన్న ప్రయత్నాలు ఫలించవన్నారు.
ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కేసీఆర్ వెంట ఎలా ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి వెంటే ఉంటామని అని సతీష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు, సంగేపు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, నాగుల లక్ష్మణ్ , సంగేపు సందీప్ , బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.