కరీంనగర శివారులోని సిరిసిల్ల బైపాస్ రోడ్డు జిగేల్మంటున్నది. నాడు అధ్వానంగా ఉన్న ఈ రోడ్డును గత బీఆర్ఎస్ సర్కారు కోట్లాది నిధులతో నాలుగువరుసలుగా విస్తరించడమేకాదు, డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది.
ఇంకా దారి పొడవునా హైమస్ట్ లైట్లు రాత్రి పూట వెలుగులు విరజిమ్ముతున్నాయి. నగర వాసులు, వాహనదారులకు ముచ్చట గొలుపుతున్నాయి.