సిరిసిల్ల టౌన్: పానీపూరి( Panipuri ) తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం ( Treatment ) అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) వైద్యులకు ఆదేశించారు. ఘటన విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్థానిక బీఆర్ఎస్ నాయకులను ( BRS Leaders ) అప్రమత్తం చేశారు. చిన్నారులను పరామర్శించి వారికి అవసరమైన మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు.
దీంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాప్ స్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నరసింహా రావు, పట్టణాధ్యక్షుడు జిందo చక్రపాణి, ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. సంబంధిత అధికారులను చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఫోన్ ద్వారా అడిగి తెలుసు కున్నారు. అస్వస్థకు గురైన వారికి ఎటువంటి ప్రమాదం లేదని, చికిత్స అందిస్తున్నారని, త్వరలోనే కోలుకుంటారని బీఆర్ఎస్ నాయకులు తెలపడంతో తనకు ఎంతో రిలీఫ్ ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులు, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కలుషిత నీరు, బయట దొరికే చిరుతిండ్ల విషయంలో పిల్లలు, పెద్దలు మరింత జాగ్రత్త వహించాలని ఆయన కోరారు. తంగళ్ళపల్లి మండలం కేసీఆర్నగర్లో పానీపూరి తిని 12 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దలు అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.