పెద్దపల్లి, అక్టోబర్ 20: పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధుల విడుదల చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ప్రతి పంచాయతీకి 10లక్షల చొప్పున మంజూరు చేయడంపై సర్పంచులు సంబురపడుతున్నారు. ఇటీవల జిల్లాలోని 266 గ్రామ పంచాయతీల్లో ప్రతి జీపీకి 10 లక్షల చొప్పున, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని బల్దియాలకు కోటి చొప్పున సీఎం కేసీఆర్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం జిల్లాలోని సర్పంచులు జిల్లా కేంద్రానికి తరలివచ్చి, సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సుల్తానాబాద్ మండలం సుద్దాల పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ కాసర్ల అంజలితో కలిసి ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ దాసరి చంద్రారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ముత్యాల రాజయ్య, సర్పంచ్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.